♦ వైమానిక దాడిలో నటాంజ్ అణుకేంద్రం దెబ్బతిన్నట్లు ఇరాన్ వెల్లడి
♦ కొనసాగుతున్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న అమెరికా ఆర్థిక భారం
ప్రాంతంలో సైనిక చర్యలను “క్రమంగా ముగించే” అంశాన్ని తన పరిపాలన పరిశీలిస్తోందని సామాజిక మాధ్యమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.
అయితే, పశ్చిమాసియాకు మరో మూడు యుద్ధ నౌకలను, సుమారు 2,500 మంది నావిక దళాన్ని అమెరికా సైన్యం తరలించింది.
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ మూడు వారాలుగా వైమానిక దాడులను కొనసాగిస్తున్నాయి. అయినప్పటికీ యుద్ధం ముగింపు ఛాయలు మాత్రం కనబడటంలేదు.
అమెరికా జాతీయ రుణం రికార్డు స్థాయిలో $39 ట్రిలియన్లకు చేరగా, యుద్ధం కోసం మరో $200 బిలియన్ల నిధి కావాలని పెంటగాన్ చేసిన విజ్ఞప్తికి కాంగ్రెస్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
కొన్ని గంటల తర్వాత, ఆ ప్రాంతంలో సైనిక చర్యలను “క్రమంగా ముగించే” అంశాన్ని తన పరిపాలన పరిశీలిస్తోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమంలో చెప్పారు.
ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు
ఇరానియన్లు విద్యుత్ కోసం ఎక్కువగా ఆధారపడే గ్యాస్ నిక్షేపాలపై దాడులను ట్రంప్ అభ్యర్థన మేరకు నిలిపివేస్తున్నట్టు ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలియజేశారు.
నిక్షేపంపై ఇజ్రాయెల్ దాడికి ప్రతిస్పందనగా ఇతర పశ్చిమాసియా దేశాల ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడులను తీవ్రతరం చేసింది.
ప్రాణనష్టం- స్థానభ్రంశం
మృతుల సంఖ్య ఇరాన్లో 1,300కి పైగా, లెబనాన్లో 1,000కి పైగా, ఇజ్రాయెల్లో 15కి; అమెరికా సైనికులలో 13 మందికి చేరింది. లెబనాన్, ఇరాన్లలో లక్షలాది మంది ప్రజలు స్థానభ్రంశం చెందారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
