♦ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినప్పటికీ వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథం
మార్చి 23న ఇరాన్లోని పవర్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇప్పుడు ఈ సమయాన్ని మరింత పొడిగించారు.
న్యూఢిల్లీ: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి కారణంగా పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభం శుక్రవారం(మార్చి 27) నాటికి 28వ రోజుకు చేరుకుంది.
ఈ నేపథ్యంలో, ఇరాన్ ఇంధన ప్లాంట్లపై దాడులను ఏప్రిల్ 6 వరకు 10 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
“ఇరాన్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు, 2026 ఏప్రిల్ 6 సోమవారం రాత్రి 8 గంటల(ఈస్టర్న్ టైమ్) వరకు 10 రోజుల పాటు ఇంధన ప్లాంట్ల విధ్వంసక పర్వాన్ని నేను నిలిపివేస్తున్నానని తెలియజేయడానికి ఈ ప్రకటనను ప్రాతిపదికగా తీసుకోండి. చర్చలు కొనసాగుతున్నాయి, ఫేక్ న్యూస్ మీడియా ఇతరులు దీనికి విరుద్ధంగా చేస్తున్న తప్పుడు ప్రకటనలు ఉన్నప్పటికీ, చర్చలు చాలా బాగా జరుగుతున్నాయి. ఈ విషయంపై మీరు చూపిన శ్రద్ధకు ధన్యవాదాలు! ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్,” అని ట్రంప్ శుక్రవారం తన ట్రూత్ సోషల్ ఖాతాలో రాశారు.
మార్చి 23న ఇరాన్లోని పవర్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు, దీనిని ఇప్పుడు మరింత పొడిగించారు.
అయితే, మరోవైపు తాము అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
