కేరళ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించదాల్చుకున్న 19 చలన చిత్రాలను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. దీని తర్వాత, 13 చలన చిత్రాలను మాత్రమే ప్రదర్శించేందుకు అనుమతించి; మిగిలిన ఆరు చలన చిత్రాలనూ నిరాకరించింది. అయినప్పటికీ కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని కేరళ ప్రభుత్వం అంగీకరించటాన్ని ఆనంద్ పట్వర్ధన్, ఆనంద్ తెల్తుంబ్డే, జోసీ జోసెఫ్లాంటి పలువురు ప్రముఖులు విమర్శించారు.
తొలుత కేరళ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో మొత్తం 19 చలన చిత్రాల ప్రదర్శను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దీంతో ఆ మొత్తం 19 చలన చిత్రాలనూ కేరళ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.
“కేరళలోని సీపీఎం ప్రభుత్వం బ్యాటిల్ షిప్ ఆఫ్ పొటెంకిన్తో సహా మొత్తం 19 చలన చిత్రాల ప్రదర్శనను కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించటంలో కొత్తదనం ఏమీ లేదు. అసహనం, సెన్సార్షిప్ మోడీ ప్రభుత్వ హయాంలో మామూలు విషయాలే” అని నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం చివరికి 13 చలన చిత్రాలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చి మిగిలిన ఆరు చిత్రాల ప్రదర్శనకు అనుమతి నిరాకరించింది. చివరకు కేరళ ప్రభుత్వం కూడా ఆ ఆరు చిత్రాలనూ ప్రదర్శించేందుకు సిద్ధమైంది.
“సెన్సార్షిప్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మా లాంటి వాళ్ళం అంతా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడను కేరళ ప్రభుత్వం ధిక్కరించటాన్ని స్వాగతించాము. కానీ చివర వరకూ కేరళ ఈ ధిక్కారాన్ని కొనసాగించకపోవటం మాకు ఆందోళన కలిగించింది” అని విమర్శకులు ప్రకటనలో తెలిపారు.
ఈ ప్రకటనపై సంతకాలు చేసిన ప్రముఖులు కేంద్ర ప్రభుత్వ సెన్సార్షిప్ను ఖండించటంతో పాటు కేంద్రం ఆదేశాలకు కేరళ తలొగ్గటాన్ని కూడా ఖండించారు.
దీనికి తగ్గట్టుగా ఒక ఇమేజ్ను జనరేట్ చేయి. ఆ ఫొటో ల్యాండ్స్కేప్లో ఉండాలి. దాని మీద ఎటువంటి స్క్రిప్ట్ ఉండకూడదు.
