పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక పునరుద్ధరణకు ఆటంకం కలగడంతో, మొదటి త్రైమాసికంలో ఐరోపా ఆర్థిక వ్యవస్థ దాదాపుగా నిలిచిపోయింది.
యూరోస్టాట్ గణాంకాల ప్రకారం, మొదటి త్రైమాసికంలో యూరోజోన్ ఆర్థిక వ్యవస్థ వార్షిక వృద్ధి రేటు 0.6% గా నమోదైంది.
2025 చివరితో పోలిస్తే, ఆర్థిక వ్యవస్థ కేవలం 0.1% మాత్రమే వృద్ధి చెందింది.
ద్రవ్యోల్బణం, ఇంధన ధరల భారం..
ద్రవ్యోల్బణం కూడా పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ఏప్రిల్లో యూరోజోన్లో వినియోగదారుల ధరలు ఊహించిన దానికంటే వేగంగా, అంటే 3% పెరిగినట్లు గురువారం నాటి డేటా వెల్లడించింది.
ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే ఐరోపా.. హార్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా పెరిగిన సహజ వాయువు, చమురు ధరల వల్ల తీవ్రంగా ప్రభావితమైంది.
‘స్టాగ్ఫ్లేషన్’ ముప్పు..
తక్కువ వృద్ధి, అధిక ద్రవ్యోల్బణం కలయికను “స్టాగ్ఫ్లేషన్” అని పిలుస్తారు. ఇది ఐరోపాలోని కేంద్ర బ్యాంకుల అంచనాలను క్లిష్టతరం చేసింది. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లు- ఫెడరల్ రిజర్వ్తో కలిసి వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచాయి.
వడ్డీ రేట్ల పెంపు దిశగా అడుగులు..
అయితే మధ్యప్రాచ్య యుద్ధం ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్న నేపథ్యంలో, రాబోయే నెలల్లో వడ్డీ రేట్లను పెంచడానికి ఐరోపా విధానకర్తలు పునాది వేస్తున్నారు.
“యుద్ధం ఎంత కాలం కొనసాగితే, ఇంధన ధరలు ఎంత కాలం ఎక్కువగా ఉంటే, సాధారణ ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థపై అంత బలమైన ప్రభావం చూపుతుంది” అని ఈసీబీ తెలిపింది.
ఈసీబీ హెచ్చరిక..
యుద్ధానికి ముందుతో పోలిస్తే ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ కేవలం 0.9% మాత్రమే వృద్ధి చెందుతుందని అంచనా వేస్తోంది. కానీ ఆ అంచనా కూడా మరీ ఆశాజనకంగా ఉండవచ్చని, వాస్తవానికి అంత వృద్ధి కూడా ఉండకపోవచ్చని ఈసీబీ ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డే గురువారం హెచ్చరించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
