Suvendu Adhikari, BJP candidate from the Bhabanipur and Nandigram constituencies, shows his election certificate while speaking to the media after winning both seats in the West Bengal Assembly elections, in Kolkata on Monday, May 4, 2026. | Photo Credit: PTI
భబానీపూర్ మరియు నందిగ్రామ్ నియోజక వర్గాల పోలింగ్ డేటా ఏమి వెల్లడిస్తుంది?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో భబానిపూర్ మరియు నందిగ్రామ్ రెండు నియోజకవర్గాలను గెలుచుకున్న తర్వాత, ఆ రెండు స్థానాల బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి, 2026 మే 4, సోమవారం నాడు కోల్కతాలో మీడియాతో మాట్లాడుతూ తన ఎన్నికల ధృవపత్రాన్ని చూపిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ డేటాను నియోజకవర్గం, బూత్ స్థాయిల వరకు లోతుగా పరిశీలిస్తే ఆందోళనకరమైన ధోరణులు వెల్లడవుతున్నాయి. అనేక స్పష్టమైన కారణాల వల్ల ఫలితం అత్యంత సందేహాస్పదంగా ఉంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్షపాతంగా అమలు చేశారు. పారామిలిటరీ బలగాలను అసాధారణంగా మోహరించారు. భారత ఎన్నికల సంఘం (ECI) నియమించిన అధికారులు రాష్ట్ర పరిపాలనను తమ చేతుల్లోకి తీసుకొన్నారు. ఫలితంగా పోలింగ్, కౌంటింగ్ సమయాలలో వెలుగులోకి వచ్చిన సంఘటనలు అన్ని అందరికీ బహిరంగంగా కనిపిస్తున్నాయి.
కానీ కనిపించని అంశం ఒకటి ఉంది. అదే అధిక సంఖ్యలో పోలింగ్ బూత్లలో ఓటింగ్ జరిగిన తీరు అవాస్తవంగా ఉండటం. అత్యధికంగాజరిగిన పోలింగ్ రేటు, అటువంటి పోలింగ్ను సాధ్యం చేయడానికి అవసరమైన అసాధారణమైన వేగం, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రక్రియపై ఆందోళనకరమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
ప్రతి దశ నుండి ఒక్కో నియోజకవర్గాన్ని తీసుకుందాం. మొదట నందిగ్రామ్, రెండు దశ భబానిపూర్.
ఈ క్రింది నిర్ధారణలకు రావడానికి ఉపయోగించిన డేటాను ECI, పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి (WB CEO) పోర్టల్ల నుండి మరియు/లేదా ECI లేదా WB CEO. ల ప్రకటనలను ప్రసారం చేసిన మీడియా నుండి తీసుకోవడం జరిగింది. ఈ విశ్లేషణ యొక్క తరువాతి భాగం కోసం ఉపయోగించిన బూత్-స్థాయి ఓట్ల మొత్తం, WB CEO వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఫారం 20 డేటా నుండి తీసుకోబడింది.
ఈ విశ్లేషణ చాలా శ్రమతో కూడినది. బహిరంగంగా ప్రకటించబడిన రాష్ట్ర-స్థాయి ఓటింగ్ శాతాలను ఉపయోగించాను. వాటిని బూత్-స్థాయి ఫారం 20 లోని సంఖ్యలతో సరి చూసాను. పోలింగ్ వేగం వాస్తవంగా సాధ్యమయ్యే పరిమితుల్లో ఉందో లేదో పరీక్షించాను.
ఒకవేళ ఈసీఐ బూత్ల వారీగా, ఏ సమయంలో ఎంత మంది ఓటు చేశారనే పోలింగ్ డేటాను విడుదల చేసినప్పుడు, అది ఇక్కడ ఉపయోగించిన డేటాకు భిన్నంగా ఉన్నట్లు తేలితే, అది నేను వేసిన ప్రస్తుత అంచనాలను మార్చే అవకాశం లేదని నొక్కి చెప్పాలి. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే, అది ఇక్కడ చెప్పిన దానికంటే చాలా దారుణమైన పరిస్థితికి మాత్రమే దారితీయవచ్చు. ఒకవేళ ఈసీఐ డేటా అంచనా వేసిన శాతం కంటే ఎక్కువ శాతం పోలింగ్ జరిగినట్లు వెల్లడిస్తే, అప్పుడు పోలింగ్ వేగం ఇప్పటికే ఉన్న అవాస్తవ వేగం కంటే కూడా మరింత వేగంగా జరిగి ఉండాలి.
ఒకవేళ ఇక్కడ అంచనా వేసిన శాతం కంటే తక్కువ శాతం పోలింగ్ జరిగినట్లు ఈసిఐ వెల్లడిస్తే అప్పుడు ECI ముందు ప్రకటించిన డేటాతో సరిపోల్చి చూడడం మరింత కష్టతరం అవుతుంది.
ఎన్నికల సంఘం వద్ద ఏ సమయంలో ఎంత పోలింగ్ జరిగింది బూత్ల వారీగా సమాచారం ఉంటే, దానిని ప్రజా పరిశీలన కోసం బహిరంగంగా ఉంచాలి. అప్పుడు ఆచరణలో అంత పోలింగ్ జరగడం సాధ్యమా అని పరిశీలించడానికి వీలుంటుంది.
ఒక్కొక్క పోలింగ్ బూత్ లో రెండు గంటలు వ్యవధిలో ఎంతమంది ఓటు వేయగలుగుతారు?
ఎలక్షన్ కమిషన్ దఫాల వారీగా ఎంతమంది ఓటు వేసింది చేసిన ప్రకటన ఆ పోలింగ్ బూత్ సామర్ధ్యానికి సరిపోయేలా ఉండాలి?
ఒక్కో ఓటరు ఓటు చేయడానికి ఎన్ని సెక్కల్లో సమయం పడుతుంది?
ఓటు వేయడం అకస్మాత్తుగా సాధ్యం కాదు. ప్రతి ఓటరు ముందుగా తన గుర్తింపును పోలింగ్ సిబ్బందికి చూపాలి. సిబ్బంది రికార్డ్ లో నమోదు చేయాలి. తర్వాత ఓటింగ్ మిషన్ దగ్గరకు వెళ్లాలి. అక్కడ తను ఎవరికి ఓటు వేయదల్చుకున్నది అక్కడ బటన్ నొక్కాలి. VVPAT కోసం ఎదురు చూడాలి.
ఆ తర్వాత బయటకు రావాలి.
పోలింగ్ బూత్ లో ఎంత సమయం పడుతుంది?
వాస్తవంగా ప్రతి పోలింగ్ బూత్ లో ఆగడం నిదానంగా వెళ్లడం ముసలి ఓటర్లు గుర్తింపు కార్డు సమస్యలు పేరు తనిఖీ చేయడం అధికారులు వీటిని నిర్వహించడానికి పట్టే సమయం ఒక్కోసారి ఓటింగ్ మిషన్ నిదానం కావడం లాంటి ఆటంకాలు అనేకం ఎదురవుతాయి.
ఓటు వేసినట్లుగా చెప్పబడిన సంఖ్య వాస్తవంగా ఎంతమంది పోటు చేయడానికి అవకాశం ఉన్నది?
వాస్తవంగా ఓటర్లు వేయడానికి పట్టే సమయం తో పోల్చినప్పుడు అంతకంటే అదనంగా ఓటు చేశారని ప్రకటించినప్పుడు సంబంధిత పోలింగ్ బూతు అధికారులు దానికి తగిన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
మొదటి పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు. ఉదయం 9 గంటల సమయానికి రాష్ట్ర స్థాయిలో నమోదైన 18.76 శాతం ఓటింగ్ ప్రకారం, నందిగ్రామ్లో సగటున ఒక బూత్లో ఉదయం 9 గంటల సమయానికి సుమారు 155 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అర్థం. అంటే 120 నిమిషాలు లేదా 7,200 సెకన్లు.
ఉదాహరణ 1: ప్రతి ఓటరు పైన తెలిపిన ఎలాంటి ఆటంకాలు లేకుండా తన ఓటు వేయడానికి కేవలం 45 సెకన్లు (ఇంత తక్కువ సమయం ఆచరణలో సాధ్యం కాదు) మాత్రమే పట్టింది అనుకుందాం. అప్పుడు ఆ పోలింగ్ బూత్ లో ఆ రెండు గంటల సమయంలో 160 మంది ఓటు వేయ గలుగుతారు.
ఉదాహరణ-2: ఒక్కో ఓటర్ కి ఎలాంటి ఆటంకాలు లేనప్పుడు ఓటు చేయడానికి 60 సెకన్ల సమయం పట్టింది అనుకుంటే రెండు గంటల వ్యవధిలో 120 మంది మాత్రమే ఓటు వేయగలుగుతారు.
ఉదాహరణ-3: 75 సెకండ్లు సమయం పట్టింది అనుకున్నప్పుడు రెండు గంటల వ్యవధిలో 96 మంది ఓటు వేయ గలుగుతారు.
ఉదాహరణ-4: ఒక్కో ఓటరు ఓటు వేయడానికి 45 సెకండ్లు సమయమే పట్టింది అనుకొని ఆటంకాలు కారణంగా మరొక ఐదు సెకన్లు లేటు అయింది అని అంటే రెండు గంటల సమయంలో 152 మంది మాత్రమే ఓటు చేయగలుగుతారు.
ఉదాహరణ-5: ఒక్కో ఓటరు ఓటు చేయడానికి 60 సెకన్ల సమయం పట్టి ఆటంకాల కారణంగా మరొక ఐదు సెకండ్లు ఆలస్యం అయితే అప్పుడు 114 మంది మాత్రమే రెండు గంటల సమయంలో ఓటు చేయగలుగుతారు.
ఉదాహరణ-6: ఒక్కొక్క ఓటరు ఓటు చేయడానికి 75 సెకన్ల సమయం పట్టింది, మరొక ఐదు సెకన్లు ఆటంకాల కారణం గా ఆలస్యం అయింది అనుకున్నప్పుడు రెండు గంటల సమయంలో 91 మంది మాత్రమే ఓటు వేయగలుగుతారు.
నందిగ్రామ్ లో మొదటి ప్రకటించిన ప్రకారం: ప్రతి ఓటరుకు ఎలాంటి విరామం లేకుండా 45 సెకన్లు పట్టిందని మనం భావిస్తేనే, ఉదయం 9 గంటలకల్లా 155 ఓట్లు ఫోన్ అయినాయి. అంటే ఇది గరిష్ట పరిమితికి దగ్గరగా ఉంది. కానీ ఓటర్లు 60 సెకన్లు తీసుకుంటే, కేవలం 120 ఓట్లు మాత్రమే సాధ్యమవుతాయి. ఒకవేళ ఆమె 75 సెకన్లు తీసుకుంటే, కేవలం 96 ఓట్లు మాత్రమే సాధ్యమవుతాయి.
సమయం పెరిగేకొద్దీ, అంతరాయం ఏమాత్రం లేకపోయినా పోలింగ్ క్రమంగా తగ్గుతుంది. కానీ, ఒక్కో ఓటుకు పట్టే సమయం పెరిగినా లేదా అంతరాయం పెరిగినా, వాస్తవ మరియు ఊహించిన ఓట్ల సంఖ్య మధ్య వ్యత్యాసం క్రమంగా పెరుగుతుంది.
వాస్తవ ప్రపంచంలో, పోలింగ్ బూత్ క్యూ స్టాప్వాచ్ లాగా కచ్చితంగా కదలదు. అందులో వృద్ధ ఓటర్లు, గుర్తింపు కార్డుల తనిఖీలు, విరామాలు, VVPAT కోసం వేచి ఉండే సమయం, సాంకేతిక లోపాలు లేదా ఆటంకాలు, అధికారులు మరియు ప్రజల కదలికలు, గందరగోళం, మానవ అలసట, ఇంకా ఇతర సాధారణ జాప్యాలు ఉంటాయి.
మధ్యాహ్నం 1 గంట అప్పటి పరిస్థితిని చూద్దాం. ఆ సమయానికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పోలింగ్ 62.18 శాతంగా నమోదైంది. దీని ప్రకారం నందిగ్రామ్లో ఒక్కో బూత్లో సగటు పోలైన ఓట్లు సుమారు 514గా ఉన్నాయి.
ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, ప్రతి ఓటరుకు కేవలం 45 సెకన్ల సమయం మరియు అంతరాయం ఏమాత్రం లేకపోయినా కూడా, కేవలం 480 ఓట్లు మాత్రమే పోల్ అవుతాయి. ఇది ఎన్నికల సంఘం ప్రకటించిన 514 ఓట్ల సంఖ్య కంటే తక్కువ.
ప్రతి ఓటరుకు 60 సెకన్ల సమయం కేటాయిస్తే, ఓటు వేసే వారి సంఖ్య మరింత తగ్గిపోతుంది. ప్రతి ఓటరుకు కేటాయించే సమయం పెరిగినా లేదా కనీస అంతరాయాన్ని పరిగణనలోకి తీసుకున్నా కూడా, అధికారికంగా సూచించబడిన పోలింగ్కు మరియు భౌతికంగా సాధ్యమయ్యే పోలింగ్కు మధ్య అంతరం పెరుగుతుంది. 20 శాతం అంతరాయం, ప్రతి ఓటుకు 75 సెకన్ల వాస్తవిక రేటుతో చూస్తే, కేవలం 77 ఓట్లు మాత్రమే సాధ్యమయ్యేవి.

సూచించిన ఓటింగ్ రేటుకు, వాస్తవ ఓటింగ్ రేటుకు మధ్య ఉన్న ఈ వ్యత్యాసమే ప్రకటించిన పోలింగ్ సంఖ్యలను అత్యంత సందేహాస్పదంగా మార్చి, ఈ ఓట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనే సందేహాన్ని కలిగిస్తుంది.
భబానిపూర్ను పరిశీలిద్దాం:
ప్రతి ఓటుకు అదే అసంభవమైన 45 సెకన్ల సమయం ఇచ్చి, విరామ సమయాన్ని కలపనంత కాలం, భబానిపూర్ సంఖ్యలు రాష్ట్ర సగటుకు అనుగుణంగానే ఉంటాయి. కానీ, బూత్ స్థాయి ఫారం 20 డేటాతో సూచించిన ఓటింగ్ శాతాన్ని పరిశీలించినప్పుడు, అది కూడా అసాధ్యంగా మారుతుంది.
ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది.
ఫారం 20 డేటా ఆధారంగా, భబానిపూర్లో 37 హై లోడ్ బూత్లు, 17 వెరీ హై లోడ్ బూత్లు ఉన్నాయి. హై లోడ్ కేటగిరీలో సగటు పోలింగ్ 778 ఓట్లు కాగా, కనిష్టంగా 701 గరిష్టంగా 880 ఓట్లు నమోదయ్యాయి. వెరీ హై లోడ్ కేటగిరీలో సగటు పోలింగ్ 955 ఓట్లు కాగా, కనిష్టంగా 901 మరియు గరిష్టంగా 1009 ఓట్లు నమోదయ్యాయి. భబానిపూర్లో extreme హై లోడ్ బూత్లు ఏవీ లేవు.
నందిగ్రామ్లో 84 హై లోడ్ బూత్లు, 68 వెరీ హై లోడ్ బూత్లు ఉన్నాయి. అలాగే, కనీసం 1100 ఓట్లు పోలైన 13 extreme హై లోడ్ బూత్లు కూడా ఉన్నాయి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఫైనల్ బూత్ లోడ్ ఎంత ఎక్కువగా ఉంటే, ఆ బూత్లలో ప్రారంభ పోలింగ్ శాతాలను వర్తింపజేసినప్పుడు వ్యత్యాసం అంత స్పష్టంగా కనిపిస్తుంది.
ఉదాహరణకు, భబానిపూర్ నియోజకవర్గంలోని హై లోడ్ బూత్ అయిన బూత్ నెం. 21ని తీసుకోండి. ఫారం 20 ప్రకారం మొత్తం 999 ఓట్లు పోలింగ్ అయినట్లుగా నమోదైంది.

ఉదయం 7 నుండి 9 గంటల మధ్య, ఎటువంటి ఆలస్యం లేకుండా ఒక ఓటరు కేవలం 45 సెకన్లలో, తన ఓటు వేసే అత్యంత అసంభవమైన సందర్భంలో కూడా, వేయగలిగే ఓట్ల సంఖ్య 160. ఈ బూత్ యొక్క ఫారం 20 పోలింగ్ సంఖ్యలకు, ఉదయం 9 గంటలకు నమోదైన 18.39 శాతం ఓటింగ్ శాతాన్ని వర్తింపజేస్తే, ప్రకటించబడిన ఓటింగ్ సుమారు 184 ఓట్లుగా వస్తుంది. అంటే, అత్యంత వేగవంతమైన మరియు ఉదారమైన అంచనా ప్రకారం చూసినా కూడా, ఈ సూచించబడిన పోలింగ్ సాధ్యత పరిమితిని సుమారు 24 ఓట్ల తేడా దాటుతుంది.
ఒకవేళ ఓటరు 45 సెకన్లకు బదులుగా 60 సెకన్లు తీసుకుంటే, మరియు ఎటువంటి అంతరాయం లేకపోతే, కేవలం 120 ఓట్లు మాత్రమే సాధ్యపడేవి. అప్పుడు, వేయబడినట్లుగా ప్రకటించిన 184 ఓట్లు, వాస్తవంగా సాధ్యమయ్యే పరిమితి కంటే సుమారు 64 ఓట్లు అదనంగా పడినట్లు లెక్క. దీనికి కొద్దిపాటి అంతరాయం తోడైనా, ఈ వ్యత్యాసం మరింత పెరుగుతుంది. రెండు గంటల వ్యవధిలో కేవలం 12 నిమిషాల అంతరాయం లేదా నెమ్మది, వాస్తవ ఓటింగ్ సమయాన్ని 120 నిమిషాల నుండి 108 నిమిషాలకు తగ్గిస్తుంది. ఒక్కో ఓటరుకు 45 సెకన్ల చొప్పున, సాధ్యమయ్యే ఓట్లు 144కు పడిపోతాయి. ఒక్కో ఓటరుకు 60 సెకన్ల చొప్పున, అవి 108కి పడిపోతాయి. ఈ విధంగా, వాస్తవ ప్రపంచంలోని చిన్నపాటి అవాంతరాలు కూడా పరిస్థితిని నాటకీయంగా మార్చేస్తాయి.
ఇప్పుడు నందిగ్రామ్లోని 7వ నంబరు బూత్ను పరిశీలిద్దాం. ఇది కూడా అత్యధిక రద్దీ ఉండే బూత్. ఫారం 20 ప్రకారం మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 1158. ఉదయం 7 నుండి 9 గంటల మధ్య, ఎటువంటి అంతరాయం లేకుండా, ఒక ఓటరు తన ఓటు వేయడానికి 45 సెకన్లు తీసుకుంటే, సాధ్యమయ్యే సంఖ్య 160. ఉదయం 9 గంటలకు నమోదైన 18.76 శాతం ఓటింగ్ శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే, సుమారుగా 217 ఓట్లు పోలయ్యాయని అర్థం.

ఎన్నికల సంఘం ప్రకటించిన పోలింగ్ సంఖ్య, ఆచరణ సాధ్యమైన పరిమితి కంటే సుమారు 57 ఓట్లు ఎక్కువ. రెండు గంటల్లో 217 మంది ఓటర్లను ప్రాసెస్ చేయాలంటే, బూత్ ఒక్కో ఓటరుకు దాదాపు 33.14 సెకన్ల చొప్పున, అంటే అర నిమిషానికి పైగా సమయం తీసుకుని పనిచేయాల్సి ఉండేది!
ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ప్రకటించిన లెక్కలు వాస్తవంగా పోల్ అయ్యే ఓట్లకు మధ్య వ్యత్యాసమే పెద్ద పరీక్షగా మారుతుంది.
రెండు గంటల పాటు నిరంతరాయంగా, ప్రతి 33 సెకన్లకు ఒక ఓటరు లోపలికి వెళ్లి బయటకు రావడానికి ఊహించుకోండి. ఒక్క విరామం కూడా లేకుండా, ఏ విధమైన మందకొడితనం లేకుండా, నెమ్మదిగా నడిచే వృద్ధ ఓటరు లేకుండా, వీల్చైర్ ఓటరుకు సర్దుబాటు చేయాల్సిన అవసరం లేకుండా, గుర్తింపు కార్డు సమస్యలు లేకుండా; ఒక్క ఈవీఎం ఆలస్యం లేకుండా, ఒక్క అధికారి కూడా ఆగకుండా, జాబితాలో తన పేరును వెతుక్కోవడానికి ప్రయత్నించే ఓటరు లేకుండా జరగడం అంటే. అది ఎన్నికల క్యూ కాదు. అది ఒక కన్వేయర్ బెల్ట్.
ఒకవేళ ఓటరు ఓటు వేయడానికి 45 సెకన్లకు బదులుగా 60 సెకన్లు తీసుకుంటే, సాధ్యత పరిమితి 120 ఓట్లకు తగ్గుతుంది. అప్పుడు, ప్రకటించబడిన 217 ఓట్లు, వాస్తవంగా సాధ్యమయ్యే సంఖ్యకు 97 ఓట్ల మేర మించిపోతాయి. ఒకవేళ ఆ ఓట్లను ప్రాసెస్ చేయాల్సి వస్తే, బూత్ ఒక్కో ఓటరుకు 60 సెకన్ల చొప్పున కదలగలిగేది కాదు. ఎటువంటి అంతరాయం లేకుండా ఉంటే ఒక్కో ఓటరుకు సుమారు 33 సెకన్ల సమయం మాత్రమే పడుతుంది.
మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల మధ్య సమయంలో అదే బూత్ మరొక ప్రకటన వస్తుంది. ఆ సమయంలో పోలైన ఓట్ల సంఖ్య 162. అంటే, ప్రతి ఓటరుకు 45 సెకన్ల చొప్పున, అంతరాయం లేకుండా లెక్కిస్తే, సాధ్యమయ్యే సంఖ్య 160 అయి ఉండేది. ఈ అవాస్తవ అంచనాతో చూసినా కూడా, ప్రకటించిన లెక్క ప్రకారం రెండు ఓట్లు అదనంగా పడినట్టు లెక్క.
ప్రతి ఓటరుకు 60 సెకన్ల చొప్పున లెక్కిస్తే, సాధ్యమయ్యే ఓట్ల సంఖ్య 120కి పడిపోతుంది. అప్పుడు వాస్తవంగా పోలింగ్ జరగడానికి అవకాశం ఉన్నదానికంటే 42 ఓట్లు అదనంగా పడినట్లు లెక్క. ఆ రెండు గంటల సమయంలో 162 ఓట్లను సాధించాలంటే, మళ్ళీ అంతరాయం లేకుండా, ప్రతి ఓటరుకు సుమారు 44.44 సెకన్ల వేగం అవసరం.
రెండు నియోజకవర్గాలలోనూ ఇలాంటి బూత్లను చాలా చూడవచ్చు. ఉదయం 7 నుండి 9 గంటల మధ్య, ఏ మాత్రం విరామం లేకుండా ఒక్కో ఓటుకు 45 సెకన్ల చొప్పున పోలింగ్ జరగడంతో, భబానిపూర్లోని 23 బూత్లలో పోలైన ఓట్ల సంఖ్య వాస్తవ సంఖ్యను మించిపోయింది. నందిగ్రామ్లో ఈ సంఖ్య 103గా ఉంది.
ఎలాంటి ఆటంకం లేకుండా ఓటు వేయాలంటే ప్రతి ఓటరుకు 45 నిమిషాలు 45 సెకండ్లు సమయం పడుతుందని ముందు ఉదాహరణలలో తెలుసుకున్నాం. ఇది అంతరాయం సున్నా అని ఊహిస్తుంది. అయినప్పటికీ, అనేక బూత్లు ఆచరణ సాధ్యత పరిమితిని దాటుతున్నాయి.
రెండు గంటల వ్యవధిలో, రెండవ వరుస కేవలం 12 నిమిషాల విరామం, ఆలస్యం లేదా అంతరాయాన్ని మాత్రమే పెంచుతుంది. ఆ చిన్న మార్పు బూతులపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుంది. భబానిపూర్లో ఇది 23 నుండి 38కి పెరుగుతుంది. నందిగ్రామ్లో ఇది 103 నుండి 136కి పెరుగుతుంది. ఇది కేవలం మొదటి రెండు గంటల పోలింగ్ సరళి అని గుర్తుంచుకోండి.

పశ్చిమ బెంగాల్లోని అనేక నియోజకవర్గాల్లో ఇలాంటి అనుమానాస్పద ధోరణులే కనిపిస్తున్నాయి.
ఫారం 20లో నమోదు చేయబడిన డేటాను నిశితంగా పరిశీలించి, బహిరంగంగా నివేదించబడిన సమయ-స్లాట్ ఓటింగ్ శాతాలతో పోల్చినప్పుడు ఈ అనుమానాస్పద ధోరణులన్నీ స్పష్టమవుతాయి. అవన్నీ అందరి కళ్ల ముందే దాగి ఉన్నాయి.
ఈ వ్యత్యాసాలు, అవకతవకలపై ఈసీఐ విశ్వసనీయంగా వివరణ ఇచ్చేంత వరకు, ప్రకటించిన ఫలితాలు తీవ్రమైన అనుమానాస్పదంగానే మిగిలిపోతాయి.
అందువల్ల 2026 బెంగాల్ తీర్పుపై సందేహమనే మచ్చ కొనసాగుతుంది. ఇది దేశ ఎన్నికల ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు.
ఈ సందేహపు మచ్చను తొలగించే ఏకైక మార్గం ఇదే. బూత్ల వారీగా సమయ ముద్రతో కూడిన ఓటింగ్ శాతం వివరాలను బహిర్గతం చేయడం. ఫారం 17Aను ఫారం 17Cతో, ఆ రెండింటినీ ఫారం 20తో సరిపోల్చడం. ప్రిసైడింగ్ అధికారుల డైరీలు, క్యూల సీసీటీవీ రికార్డులు, ఈవీఎం ఈవెంట్ లాగ్లు, మరియు సంబంధిత పోలింగ్ రికార్డులను పరిశీలన కోసం ప్రజలకు అందుబాటులో ఉంచడం
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
