♦ దుబాయ్ విమానాశ్రయంలో విమానాల రద్దు
♦ ట్రంప్ ‘హార్ముజ్ రక్షణ’ పిలుపుకు దక్కని స్పందన
హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడానికి యుద్ధ నౌకలు కావాలని ట్రంప్ కోరిన ఏడు దేశాల్లో ఏ ఒక్కటీ ఇంతవరకు అంగీకారం తెలపలేదు.
హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచేందుకు యుద్ధ నౌకలను పంపాలని సుమారు ఏడు దేశాలను తాను డిమాండ్ చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
అయితే, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ, ఆయన పిలుపుకు ఎలాంటి ఖచ్చితమైన హామీలు లేదా స్పందన రాలేదు.

యూఏఈపై ఇరాన్ ఆరోపణలు
ఇరాన్ చమురు ఎగుమతులను నిర్వహించే ప్రధాన టెర్మినల్ ఉన్న ఖార్గ్ ద్వీపంపై దాడులు చేయడానికి, యూఏఈలోని “నౌకాశ్రయాలు, రేవులు, రహస్య ప్రదేశాలను” అమెరికా ఉపయోగిస్తోందని టెహ్రాన్ ఆరోపించింది.
భారత్లో పెరుగుతున్న ఆందోళన
యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించకపోవడంతో, భారత్లో ఇంధన కొరతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
