
దేశవ్యాప్తంగా భారీ వైద్య విద్య సామర్థ్య విస్తరణనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 10,000 కొత్త యూజీ, పీజీ వైద్య సీట్లను పెంచుతూ వైద్యసేవలకు, శ్రామికశక్తి అందుబాటుకు బలాన్ని చేకూర్చింది.
2025 సెప్టెంబర్ 24న ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్రమంత్రివర్గం కేంద్ర ప్రాయోజిత పథకం(సీఎస్ఎస్) మూడవ విడత అమలును ఆమోదించింది. పోస్ట్గ్రాడ్యుయేట్, అండర్గ్రాడ్యూట్ వైద్య విద్య సామర్థ్యాన్ని దేశవ్యాప్తంగా ఇది గణనీయంగా విస్తరింపజేస్తుంది.
భారతదేశంలోని 1.4 బిలియన్ పౌరులకు– ప్రత్యేకించి ఎవరైతే గ్రామీణ, గిరిజన, వెనుకబడిన, మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్నారో వారికి చట్టబద్ధమైన- బలమైన సార్వత్రిక వైద్యాన్ని(యూహెచ్సీ) అందుబాటులో ఉంచడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవస్థలో కీలకమైన ఈ అంశం అర్హమైన వైద్య నిపుణులను ఇందులో భాగంగా అందుబాటులోకి తేవడం. ఎంత ప్రభావవంతంగా వైద్య విద్యా సంస్థలు స్థాపించబడతాయనే దాంతో పాటు క్రమబద్ధీకరణ, మద్దతుపై ఇది అమలు చేసే విధానం ఆధారపడి ఉంటుంది.
గడిచిన పది సంవత్సరాలలో వైద్య విద్యా వ్యాప్తిలో గరిష్ట పురోభివృద్ధి సాధించబడింది. ప్రస్తుతం 808 మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. ఈ సంఖ్య ప్రపంచంలోనే చాలా ఎక్కువని చెప్పవచ్చు. అంతేకాకుండా 1.23 లక్షల ఎంబీబీఎస్ సీట్లతో ఐక్య సామర్థ్యాన్ని కలిగి ఉంది.
2014 నుంచి 2024 వరకు 69,000కంటే ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు- 43,000 పోస్ట్గ్రాడ్యుయేట్ సీట్లను అదనంగా పెంచారు. దృష్టిసారించిన విధానపర నిర్ణయాలు, నియంత్రిత మార్పుల ప్రభావాన్ని ఇవి ప్రతిబింబిస్తాయి.
ఏదిఏమైనప్పటికీ ఈ పురోభివృద్ధి అడుగులతో పాటు, పరిమితమైన వైద్యరంగ సేవలు అందుబాటులో ఉండడం వల్ల ఇప్పటికీ చాలా ప్రాంతాలలో ప్రజలు ఇబ్బందిపడాల్సి వస్తుంది.
22 కొత్త ఆసుపత్రులకు శ్రీకారం..
ఈ పెచ్చుల దృష్ట్యా, ప్రభుత్వం చట్ట- పరిపాలనపరమైన చర్యలను తీసుకుంది. ఇందులో భాగంగా “స్వత్య సురక్ష యోజన(పీఎంఎస్ఎస్వై)” పరిధిలో 22 కొత్త ఏఐఐఎమ్ఎస్లకు శ్రీకారం చుట్టింది. ఇవి అత్యాధునాతన వైద్య విద్య, ప్రత్యేక వైద్యసేవలను అందిస్తాయి. అదనంగా వైద్య విద్యాసంస్థ(సిబ్బంది అర్హత) రెగ్యూలేషన్- 2025 అవసరమైన నైపుణ్యాలున్న వారిని ఖాళీలలో భర్తీ చేస్తుంది.
కుటుంబ సంరక్షణ- వైద్య మంత్రిత్వ శాఖ ఈ ప్రణాళికను రూపొందించింది. ఇది స్పష్టమైన చట్టపరమైన, విధాన నిబద్ధతో కూడిన మెరుగైన వైద్యసేవ శ్రామికశక్తిని ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా భరోసాతో కూడిన న్యాయమైన వైద్య విద్య సేవలను దేశంలోని అన్ని ప్రాంతాలలో అందుబాటులోకి తేవడం ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం.
ముఖ్యమైన అంశాలు:
♦ ఈ భారీ విస్తరణ కోసం ఆరోగ్య మంత్రిత్వశాఖ వైద్య విద్యకు సంబంధించిన రెండు కీలక పథకాలను ప్రారంభించింది. అవేంటంటే:
◊ పీజీ విస్తరణ కోసం మూడవ విడిత కేంద్ర ప్రాయోజిక పథకం(సీఎస్ఎస్)
◊ యూజీ విస్తరణ కోసం కేంద్ర ప్రాయోజిత పథకం వర్తింపు
♦ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ పథకం ద్వారా 5,000 పీజీ సీట్లు– 5,023 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా జోడించబడ్డాయి. 2028- 2029 వరకు పీజీ విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రులు స్వయంప్రతిపత్తితో నిలబడతాయి. నైపుణ్యత కలిగిన నిపుణులు, విశేషజ్ఞుల డిమాండ్ దేశవ్యాప్తంగా పెరుగుతున్న క్రమంలో, దీనినుద్దేశించి ఈ విస్తరణకు రూపమిచ్చారు.
♦ ఈ ప్రణాళిక పూర్తి ఆర్థిక వ్యయం రూ 15,034,50 కోట్లుగా నిర్ణయించబడింది. కేంద్రప్రభుత్వం రూ 10,303.20 కోట్లను, రాష్ట్ర ప్రభుత్వం రూ 4,731 కోట్ల నిధులను అందిస్తుంది. ఒక్క సీటుకు ఖర్చు పరిమితి రూ 1.50గా మెరుగుపరచబడింది. ఉన్నత నాణ్యమైన మౌలిక సదుపాయాలు, శిక్షణా సౌకర్యాలు పథకంలో కల్పించబడ్డాయి.
♦ కీలకమైన పాత్రను పోషించనున్న ప్రణాళిక:
◊ అండర్ గ్రాడ్యుయేట్ వైద్య సామర్థ్యాన్ని విస్తరించడం వల్ల ఎంబీబీఎస్ సీట్లు పెరుగుతాయి. ఎక్కువ మంది విద్యార్థులకు ప్రభుత్వ విద్యాసంస్థలలో వైద్య విద్య అధ్యయనం చేయడానికి అవకాశాన్ని కల్పించబడుతుంది.
◊ అదనపు పోస్ట్ గ్రాడ్యుయెట్ సీట్ల మెరుగుదల వల్ల వైద్య విశేషజ్ఞులు అందుబాటులో ఉంటారు. క్లిష్టమైన వైద్య విభాగాలకు నిపుణుల స్థిరమైన సరఫరా చేయడం వల్ల ఇదంతా జరుగుతుంది.
◊ ప్రభుత్వ కాలేజీలు, ఆసుపత్రులలో నూతన వైద్య సౌకర్యాలను పరిచయం చేయడం వల్ల, అధునాతన వైద్య విద్యా, సేవల విస్తరణ పరిధి పెరుగుతుంది.
◊ అర్హతపొందిన వైద్య నిపుణుల డిమాండ్ దేశవ్యాప్త వైద్యరంగంలో పెరుగుతోంది. ఇటువంటి సందర్భంలో ఇది ఒక ఉపశమనాన్ని కలగజేస్తుంది.
◊ ప్రత్యేకించి వెనుకబడిన, మారుమూల ప్రాంతాలలో శిక్షణపొందిన వైద్యులు, విశేషజ్ఞుల సంఖ్యను పెంచడం వల్ల నాణ్యమైన వైద్యరంగాన్ని మెరుగుపరచవచ్చు.
◊ ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని, పూర్తిగా కొత్త సదుపాయాలు నిర్మించాల్సిన అవసరాన్ని తగ్గించి, తక్కువ ఖర్చుతో తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను విస్తరిస్తారు.
◊ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా వైద్యరంగ వనరులను పంపిణీ చేయడం వల్ల ప్రాంతీయ సమతుల్యతకు దోహదపడుతుంది. ఇది వైద్య సేవల అందుబాటు, సామాగ్రి మధ్య ఉన్న పెచ్చులను పూడుస్తూ వారధిలా నిలుస్తుంది.
◊ స్థితిస్థాపకత వైద్య వ్యవస్థలను ఎక్కువగా ఏర్పాటు చేయడం వల్ల వర్తమాన, భవిష్యత్తు ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవడంలో వ్యూహాత్మక సామార్థ్యమైన నిర్మాణానికి ప్రభావవంతమైన స్పందనగా అందించడం.
♦ ఈ పథకాలు వివిధ కీలకమైన ఫలితాలను అందిస్తాయి. ఇవి ఆరోగ్యరంగంతో పాటు విస్తృత ఆర్థికవ్యవస్థకు రెండింటికి ప్రయోజనకరిగా మారుతాయి:
1. ఎక్కువ విద్యార్థులు వైద్య విద్యను అధ్యయనం చేయగలుగుతారు. ఇది పెరుగుతోన్న వైద్యుల డిమాండ్కు సహాయకరి అవుతుంది.
2. నాణ్యమైన శిక్షణను మెరుగుపరచడం వల్ల విశ్వవ్యాప్త ప్రమాణాలకు సరిపోలుతుంది. పట్టభద్రులు అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ పాత్రలకు సన్నద్ధం అవుతారు.
3. అతిపెద్ద నిపుణుల కొలను వల్ల సరసమైన వైద్యరంగం, విదేశీ మారక ద్రవ్యానికి కేంద్రంగా భారతదేశం మారుతుంది.
4. వైద్యరంగ అందుబాటును విస్తరించడం వల్ల గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో ప్రాంతీయ అసమానతలు తగ్గుతాయి.
5. ఈ పథకం వైద్య నిపుణులు, సిబ్బంది, పారామెడిక్స్, పరిశోధకులు, సహాయ సిబ్బంది ఉద్యోగాలను కల్పిస్తుంది.
6. బలమైన వైద్యరంగ వ్యవస్థ అత్యవసర స్పందనను మెరుగుపరుస్తుంది. సామాజిక- ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడుతుంది.
7. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా వైద్య సేవలను పంపీణీ చేయడం వల్ల దేశవ్యాప్తంగా అందుబాటును మెరుగుపరిచినట్టు అవుతుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.